బీరే ఈశ్వర్ ను పరామర్శించిన చిరు, పవన్ అభిమాన సేవా సంఘ ప్రతినిధులు

  • జర్నలిస్టు బీరె ఈశ్వర్ ను పరామర్శించిన అఖిల భారత చిరంజీవి యువత మరియు అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘ ప్రతినిధులు

బెంగుళూరు: సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో జర్నలిస్టు బీరె ఈశ్వర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ప్రాణాపాయ పరిస్థితిలో బీరే ఈశ్వర్ బెంగళూరు లోని ప్రముఖ హాస్పిటల్ లో చేరడంతో విషయం తెలుసుకున్న అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం మరియు అఖిల భారత చిరంజీవి యువత నాయకులు హాస్పిటల్ దగ్గరకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. హాస్పిటల్ లోని వైద్యులను అడిగి బీరే ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు సత్యనారాయణ మహేష్, రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు మురళి గౌడ ప్రధాన కార్యదర్శి సతీష్ యాదవ్, బెంగళూరు నగర అధ్యక్షులు అనిల్, రాష్ట్ర కజెన్సీ గోవర్ధన్ రాయల్, ఐటీ టిప్ సభ్యుడు అనిల్ యాదవ్, నాగేంద్ర బి.బీ.మ.పి, మహేష్ కుమార్, సతీష్ ఉన్నారు.