సైకో పరిపాలనలో నిజం గెలవాలి

  • నిజం గెలవాలి కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో
నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు ఉమ్మడిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగణాసురుడికి కళ్ళు తెరిపిద్దాం అంటూ.. సైకో పరిపాలనలో నిజం గెలవాలి అని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఎం దామోదర్ నాయుడు, రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఎర్రం రెడ్డి, మండల జనసేన నాయకులు రాజ గోపాల్, షేక్ సలీమ్, శ్రీనివాసరాజు, మాజీ టీడీపీ గ్రామ అధ్యక్షుడు వెంకట రమణ, టీడీపీ సీనియర్ నాయకుడు రామాంజనేయులు, మాచిరెడ్డిగారిపల్లి మాజీ సర్పంచ్ నగరాజ, సి వెంకటరమణ, బీసీ నాయకుడు ప్రసాద్, రాజా నాయుడు, జనసైనికులు, స్థానికులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.