పార్టీ ఆదేశానుసారం నిరసన తెలిపిన చిత్తూరు జిల్లా వీరమహిళా విభాగం

చిత్తూరు, ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లక్షల విద్యార్థులతో పాటు వారి కుటుంబాలనూ కరోనా ముప్పులోకి నెట్టే విధంగా పాఠశాలల్లో తరగతులను కొనసాగిస్తూ, మొండి వైఖరితో బాధ్యతా రాహిత్యాన్ని అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోవిడ్ ఉధృతి తగ్గే వరకూ తరగతులను వాయిదా వేయాలనే డిమాండ్ తో జనసేన పార్టీ వీరమహిళలు నల్ల రిబ్బన్ ధరించి, ప్లకార్డులతో తిరుపతి నందు పిఏసి కార్యాలయం వద్ద నిరసనను తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు ఆకేపాటి సుభాషిణి, కంచి శ్యామల, లత, చందన మరియు కీర్తి పాల్గొన్నారు.