గుడివాడలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గతవారం ఇచ్చినట్లుగానే నిరంతరం జనసేన పార్టీలో కార్యకర్త క్షేమం గురించి ఆలోచించే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రమాద భీమా మొదటి విడతలో సభ్యత్వం చేయించుకున్న గుడివాడ జనసైనికులకు సభ్యత్వ నమోదు కిట్లను ఆదివారం జనసేన లక్ష్మీ కాంత్ అందజేయడం జరిగింది. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు.