దాడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పాలూరు బాబు

గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా గొల్లపల్లి జనసేన ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు పాలూరు, సంచనా గంగాధర్, లంక రమేష్, చీమల సతీష్ జనసైనికులు దాడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత గొల్లపల్లి జనసైనికులు ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.