రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా రోగులకు చికిత్స, బ్లాక్ ఫంగస్, ఔషధాలు, టీకాలపై సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.