నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర నీటిపారుదల రంగంపై సమీక్ష జరిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధం అని గతంలోనే కేంద్ర జలశక్తి సంఘానికి కేసీఆర్ తెలిపారు. కాగా, నేటి సమీక్షలో అపెక్స్ కౌన్సిల్‌కి డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.