ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి ఈ నెల 10న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటం సంతోషంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ దేశ ఆత్మగౌరవానికి, జాతికే గర్వకారణమని అభివర్ణించారు. కొత్త భవన నిర్మాణం వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నానని కేసీఆర్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదీకి కేసీఆర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.