ఎం.పి.పి గ్రామానికి రోడ్డు వేయండి సీఎం సార్

*గళమెత్తిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (GoodMorningCM Sir ) #గుడ్ మార్నింగ్ సీఎం సార్ పిలుపు మేరకు వీరఘట్టం పరిధిలో చిదిమి వివిధ గ్రామ పంచాయతీ లను కలుపుతూన్న రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.

ఈ సందర్బంగా వీరఘట్టం మండలం చిదిమి గ్రామ రహదారి గురించి జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని మాట్లాడుతూ

రోడ్లు సమస్య ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్.టి.సి చార్జీలు పెఒచారు.. కానీ రోడ్లు వేయడం మరిచారు. మన మతిమరుపు సీఎం జగన్ ని తన బాధ్యతను గుర్తు చేసేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు GoodMorningCM Sir కార్యక్రమం చేపట్టారు.

శ్రీకాకుళం పార్వతీపురం ప్రధాన రహదారి నుండి సి.ఎస్.ఆర్. పేట, పాలమిట్ట, విజయరంపురం, వెంకమపేట, చిదిమి గ్రామాల ప్రజలు ఈ రోడ్డు పై ప్రయాణించడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, రైతులు, సచివాలయం సిబ్బంది ఉపాద్యాయులు వెల్లి రావడానికి చాలా ఇక్కట్లు పడుతున్నారు అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ రోడ్డు పై ప్రయాణం నరకం అని అన్నారు. అలాగే చిదిమి గ్రామానికి చెందిన వ్యక్తి ఎంపీపీ గా ఉన్నప్పటికీ తన స్వగ్రామం చిదిమి కి రోడ్డు వేసుకోలేని పరిస్థితి లో పరిపాలన చేస్తున్నారు. జగన్ అరాచక పాలనను జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో రోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కర్నేన పవన్ సాయి, కోడి వెంకటరావు నాయుడు, సుమన్, ప్రణీత్, కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.