జనసేన నాయకుల వినతి పత్రానికి స్పందించిన కలెక్టర్

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలో వున్న ఫించా ప్రాజెక్టు పోయిన నాలుగు నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు దాదాపు 30 మీటర్లు రింగ్ బడ్డ దెబ్బతినడం జరిగింది. ఆ ప్రాజెక్టు కింద వందల ఎకరాల భూములలో పంటను పండించుకుంటున్నారు. మల్లీ సీజన్ మొదలవుబోతుంది ఇప్పటివరకు ప్రభుత్వం మరమ్మతులు చేయనే లేదు. ఆవిషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన నాయకులు ప్రాజెక్టును పరిశీలించి సోమవారం స్పందనలో కడప జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సమక్షంలో త్వరగా ప్రభుత్వం డబ్బులు కేటాయించి మరమ్మతులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ నాయకులు హరి రాయల్, రామ శ్రీనివాసులు వినతిపత్రం అందించడం జరిగింది. కలెక్టర్ స్పందించింది వెంటనే మరమ్మతులు చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సుండుపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.