రా… కదలి రా.. ఛలో రణస్థలం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమాన్ని జనవరి 12 శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహించబోతున్నారు. ఉత్తరాంధ్ర నుండి వలసలు, యువత ఉపాధి, మత్స్యకారుల బతుకు పోరాటం, మైనింగ్ మాఫియా, పర్యావరణ విధ్వంసం, భూకబ్జాలు – దందాలు, మొదలగు రంగాల్లో వెనుకబాటు తనానికి కారణాలు తెలియజేయుటకు రా.. తరలి రా.. జనసేనాని సమక్షంలో యువత గళాన్ని వినిపించుటకు యువశక్తి కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం నుండి ఈ ప్రయాణమని మనుబోలు గణపతి తెలియజేసారు. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కార్యదర్శి మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పోలూరు పెంచల నరసింహా, నాగవేటి రమేష్, తాండ్ర శ్రీను, ఖమ్మం నుండి కొప్పుల నిఖిల్, కొప్పుల సంపత్, పొడకంటి అరవింద్, ఎస్.కె.ఇంతియాజ్ పాల్గొన్నారు.