జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలి రండి: కటికం అంకారావు

పల్నాడు, మార్చి 14న జరగబోవు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పల్నాడు నుంచి వేలాదిగా తరలి రావాలని, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో, జరగబోయే సభ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ, జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశాలపై సభావేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని ఆయన తెలియజేశారు. సభా ప్రాంగణం ఏర్పాట్లు అన్నీ చురుగ్గా జరుగుతున్నాయని, 26 ఎకరాలలో మీటింగ్ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆవిర్భావ సభకు సంబంధించి,12 కమిటీల నియామకం జరిగాయని ఆయన తెలిపారు. సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరు పవన్ వైపు మొగ్గు చూపుతారని, ఆయన ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వేలాదిగా మీటింగ్ తరలిరావాలని, ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి మణి, అజీస్, ప్రసాద్, కోటేశ్వరరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.