కరెంటు సబ్ స్టేషన్ ఫిల్లింగ్ పనుల ప్రారంభం

పి.గన్నవరం: పాసర్లపూడి లంక శివారు వాడ బోధి డ్రైన్ ప్రక్కన బోనం వారి మెరక దగ్గర నూతనంగా నిర్మించనున్న కరెంటు సబ్ స్టేషన్ ఫిల్లింగ్ పనులను సోమవారం పాసర్లపూడి లంక సర్పంచ్ తెల్లగా రెడ్డి సూర్యప్రకాశరావు, లూటుకుర్రు సర్పంచ్ మామిడి మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఆడబాల తాత కాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి పార్వతి, సత్తిబాబు, వార్డు నెంబరు బోనం కొండ, కసిరెడ్డి రమణ, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.