జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న పోతుల సాయినాథ్

తంబళ్లపల్లె నియోజకవర్గం: పి టి ఎమ్ మండలం
టి సదుం గ్రామంలో గురువారం జయహో బీ సీ కార్యక్రమం తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శంకర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టి డి పి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ తంబళ్లపల్లె నియోకవర్గ జనసేన పార్టి ఇంచార్జ్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ.. బి సి, ఎస్ టి, ఎస్ సి, మైనార్టీ కులాలు అందరూ ఒక్క తాటిపై ఉండాలని అగ్రవర్ణ కులాలను కలుపుకొని వైఎస్ఆర్ అరాచక పకృతి సంపదను దోచుకుతింటున్న బకాసురున్ని తరిమి కొట్టి అభివృద్ధి పథంలో నడవాలి అంటే జనసేన & తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో పి టి ఎమ్ మండల అధ్యక్షుడు శంకర, కురబలకోట మండల అధ్యక్షుడు దామోదర్, ములకలచెరువు మండల ఉపాధ్యక్షుడు ఎస్. లక్ష్మణ పవర్ అఫ్ ది టీం అద్యక్షుడు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, మనోహర్ రాయల్ కందుకూరు నాగేంద్ర తెలుగుదేశం & జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.