జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షలు చొప్పున పరిహారం: జగన్
అమరావతి: ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. రెండు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకఅష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.