హౌస్ అరెస్టులను ఖండిస్తున్నాము: రాయపూడి

  • జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు

అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ జనసేన అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన మేరకు, ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని జనసేన పార్టీ నాయకులను రాత్రి నుండి హోస్ అరెస్ట్ చేయటం చాలా బాధాకరమైనా విషయం, అరెస్టులను ఖండిస్తున్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పౌరుని హక్కులు భంగం కలిగించటం చాలా సిగ్గు చేటు అయిన విషయం. నేను దాదాపుగా 30 రోజులు నుండి హాస్పిటల్ లో కాలుకు మేజర్ సర్జరీ చేయించుకొని 4 రోజులు క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాను 34 రోజులు నుండి కాలు భూమి మీద పెట్టకుండా మంచం పైన ఉన్నా నాకు రాత్రి పోలీస్ వారు వచ్చి నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసిన విధానము చూచి, ప్రభుత్వ చర్యకు నవ్వాలా? ఏడవాల? అర్ధం కాకుండా ఉంది. నేను ఒక న్యాయవాది నీ, మంచం మీద నుండి లెగవలేని పరిస్థితిలో ఉన్నా నాకే ఇలా జరిగితే, సామాన్యాలు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ, పోలీస్ చర్యను జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నామని రాయపూడి పేర్కొన్నారు.