నిమ్మల దొరబాబుకు అభినందన సత్కారం

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామంలో జనసేన నిడమర్రు మండల అధ్యక్షునిగా ఎంపికైన నిమ్మల దొరబాబును అభినందిస్తూ ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, లక్ష్మీనారాయణ ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు ఘనంగా సత్కారం చేసారు, వారితో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన్న రత్తయ్య, ఉంగుటూరు నియోజవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ అయితం దుర్గాప్రసాద్, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసి రాజు, బెతు మురళి, తోట పవన్ రావు, తానేటి జోగేశ్వరరావు, నిడమర్రు గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు.