కిడ్నీ వ్యాధి బాధితుడికి జనసేన ఆర్థిక సాయం

రాజోలు నియోజకవర్గం, అరవపాలేం గ్రామానికి చెందిన జక్కంపూడి సత్తిబాబు రెండు కిడ్నీలు పాడై, డయాలసిస్ చేయించుకునే స్థోమత లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు సత్తిబాబును కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, దైర్యం చెప్పి ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం డాక్టర్ రాపాక రమేష్ బాబు 5000 రూ.లు , తాడి మోహన్ కుమార్ 2000 రూ.లు, గోళ్ళమందల పూర్ణ భాస్కరరావు 2000 రూ.లు, దిరిశాల బాలాజీ 2000 రూ.లు, ఆకన బాబ్జీ నాయుడు 2000రూ.లు, రావూరి నాగు 2000 రూ.లు, గుండబత్తుల తాతాజీ 1000 రూ.లు, గుబ్బల ఫణి కుమార్ 1000 రూ.లు, సూరిసెట్టి శ్రీనివాస్ 1000 రూ.లు, ఉండపల్లి అంజి 1000 రూ.లు, బెల్లంకొండ పుత్రయ్య 1000 రూ.లు మొత్తం కలిపి 20000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.