దాహార్తి కై నూతన మంచినీటి బోర్లు ఏర్పాటు: వైస్ ఎంపీపీ ఆనందరాజు

రాజోలు: మండల పరిధి లోని చింతలపల్లి గ్రామ పరిధిలో పిప్పళ్ళ వారి మెరకలో మంచినీటి కొరతను తీర్చేందుకు గాను గురువారం నూతనంగా మంచినీటి బోరులను (హ్యాండ్ పైపులు) స్థానిక ప్రజల ప్రోత్సాహంతో మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన స్థానిక వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృషికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు వైస్ ఎంపీపీ ఆనందరాజు అభినందన వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో పలు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిని ఎల్లవేళలా అందిస్తానని వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.