పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా పక్కదోవ పట్టించడం దారుణం

మదనపల్లె, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా అధికారులు పక్కదోవ పట్టించడం దారుణమైన విషయం. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో ఎంఎల్ఎస్ పాయింట్ లో 1300 బస్తాల బియ్యం,విస్సన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ లో 700 బస్తాల బియ్యం రాష్ట్ర స్థాయి అధికారులు మాయం చేస్తూ వస్తున్నారు. డీలర్లతో కలిసి అధికారులు ఇలా మోసానికి పాల్పడుతున్నారు. ఈ ప్రాంతం లో ఇలా అధికారులు రేషన్ బియ్యం స్కాం చేయడం రెండవసారి కానీ ఇంతవరకు పౌర సరఫరలశాఖ నుండి అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. పేదలకు ఇచ్చే బియ్యంలో కూడా మోసం చేయడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.