వైసీపీ నుంచి జనసేనలోకి కొనసాగుతున్న వలసలు

తిరుపతి, వైసీపీ యువనాయకుడు బాలాజీ జనసేనలో చేరారు. ఈ సందర్బంగా జనసేన-తెలుగుదేశం-బీజీపీ ఉమ్మడి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత పార్టీలోకి రావడం శుభపరిణామం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి లు అభివృద్ధి పేరిట అరాచకం సృష్టించారు. ప్రజలు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలని ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూస్తాము అని తెలియచేసారు. భూమన కుటుంబం చేతిలో తిరుపతి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు, మోది అండతో చంద్రబాబు అనుభవంకు తోడు పవన్ యువశక్తితో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగాలు పరిశ్రమల ఏర్పాటు చేస్తాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నన్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో యువత చేరడం సంతోషం, వైసీపీకి అభినయ రెడ్డికి షాక్ ఇచ్చిన వైసీపీ యువ నాయకులు, వైసీపీ పార్టీకి ఇకపై షాక్ లు మాత్రమే మిగులుతాయి వైసీపీ పార్టీ అరాచక పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులను ప్రజలు గెలిపించేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అని తెలియచేసారు. అబినయ్ రెడ్డిని ప్రజలు ఓడించడం ఖాయం వైసీపీ నుంచి యువత జనసేనలోనికి రావడం సంతోషం అందరం ఐక్యంగా ప్రచారం చేసి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించుకుంటాం అని తెలియచేసారు. ఈ సందర్బంగా బాలాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాకు చేసింది ఏమి లేదు కాపు కాసేందుకు ఎవరు సిద్ధంగా లేరు. జనసేనలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతకి చేసింది ఏమి లేదు. వైసిపి తిరుపతిలో ఖాళీ అవుతుంది అని తెలియచేసారు. జనసేన-తెలుగుదేశం-బీజీపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు ఖాయమైంది. ఆయనను అత్యంత మెజారిటీకి మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నగర వార్డ్ నాయకులు జీవకోన యువనాయకులు జనసైనికులు వీరామహిళలు పాల్గొన్నారు.