ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నీహారిక నాయుడు

తెలంగాణ, ఉప్పల్ నియోజకవర్గం: జనసేన, బిజేపి ఉమ్మడి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ప్రచారంలో భాగంగా గురువారం బీజేపి ముఖ్య నాయకులు ఎంపి డా. కె లక్ష్మణ్ మరియు జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ నీహారిక నాయుడు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీహారిక నాయుడు మాట్లాడుతూ.. కుటుంబ పార్టీలకు స్వస్తి చెప్పి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించే మోడీ గారిని నమ్మి కమలం గుర్తుకి ఓటు వేద్దాం అని జనసేన పార్టీకి పడవలసిన ప్రతి ఓటు కమలం గుర్తుకు వేసి జనసేన పార్టీ మద్దతు తెలిపుదాం.. మన అభ్యర్థి ప్రభాకర్ గారిని గెలిపించుకుందాం అని తెలియచేస్తూ ఈ ప్రచారంలో జనసేన పార్టీ తరపున పాల్గొని మద్దతు తెలిపిన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ధన్యవాదాలు తెలియచేశారు.