కరోనా ప్రభావం ఖైరతాబాద్‌ గణపతిని 9 అడుగులకు పరిమితం…

ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ కొండంత రూపంతో భక్తులను కాచే గణేశుడు ఖైరతాబాద్‌ గణేశుడు.   2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు.. ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు.