తిరుపతి వేద పాఠశాలలో మరో 10మందికి కరోనా..

ఈనెల 10న తిరుమల వేద పాఠశాలలో 57 మందికి కరోనా నిర్ధారణ అయిన విషయం విదితమే. తాజాగా మరో 10 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణయింది. దీంతో మరోసారి ఇక్కడ కరోనా కలకలం రేపింది. పైన పేర్కొన్న 57 మందికి చికిత్స సాగుతోంది. ఐదో రోజు పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా.. మరో 10మందికి సోకినట్లు నిర్ధారణయింది. వీరిలో 6 గురు విద్యార్థులు, 4గురు ఉపాధ్యాయులున్నారు. వీరిని పద్మావతి కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ పాఠశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 67కి చేరింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన సుమారు 420మంది విద్యనభ్యసిస్తున్నారు.