విద్యార్థులకు రాగిజావ పంపిణీ ప్రారంభించిన కౌన్సిలర్ విజయలక్ష్మి

అమలాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహనరెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావ అందించే కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని అమలాపురం పురపాలక సంఘము 9వార్డ్ ఝన్సీ లక్ష్మి బాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మివాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఎమ్ ఎస్ ఎన్ మూర్తి, ఉపాధ్యాయురాలు టి. సత్యవతి పాల్గొన్నారు.