పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవన్ బాలాజీని సత్కరించిన గురుదత్

రాజానగరం, జనసేన పార్టీని అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున జనవాణి పేరిట జనసేన పార్టీ ఎన్నికల గుర్తుని ప్రజల్లోకి తీసుకెళుతున్న కృష్ణజిల్లాకి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవన్ బాలాజీ రాజానగరం నియోజకవర్గం వస్తున్నారు అని తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని సత్కరించి, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గురుదత్ మాట్లాడుతూ పవన్ బాలాజీ లాంటి నిస్వార్థ జనసైనికుల వల్లే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేస్తుందని తెలిపారు.