నాదెండ్లతో మర్యాదపూర్వక భేటీ

తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాశి కొండ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు, అనంతరం వారితో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం దర్శి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో దర్శి పర్యటన ఉంటుందని తెలియచేసారు.