వేపాడ మండల జనసేన కమిటీ సమావేశం

జనసేన పార్టీ వేపాడ మండల అధ్యక్షులు సుంకర అప్పారావు అధ్వర్యంలో మండల కమిటీ ఏర్పాటు ఆదివారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ఎస్.కోట నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బీన సన్యాసి నాయుడు ప్రసంగిస్తూ రాబోయే 100 రోజులు టీడీపీ జనసేన ఉమ్మడి మానిఫెస్టోని ప్రజలకు వివరించి వైసీపీ పార్టీని గద్దె దించి జనసేన టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ, జనసేన కార్యకర్తలు సమన్యయముతో కష్టపడి పనిచేయాలని జనసేన ఆక్టివ్ మెంబెర్స్ కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపళ్లి రవి కుమార్ జామి మండల నాయకులు దేగల ఈశ్వరరావు ఎల్. కోట మండల ఉపాధ్యక్షులు అలమంన్ధ రాంబాబు, వేపాడ మండల నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, కోలా మధు, కన్నయ్యదొర తదితరులు పాల్గొని ప్రసంగించారు.