సిపిఐ, జనసేన కలిసి చేసిన రాస్తారోకో విజయవంతం
ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ఉన్న ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షానికి గుంతలుగా ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది, సిపిఐ నాయకులు కె. వీరారెడ్డి గారు మరియు జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ గారు కలిసి ఈనెల 8వ తారీఖున రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, 15వ తారీకు లోపు ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతల్ని పూడ్చే విధంగా చేయాలి అని అధికారులకు తెలియజేయడం జరిగింది.. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చడం జరిగింది, ఈ సందర్బంగా గుంతలను పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన అధికారులకు ధన్యవాదాలు తెలుయజేడం జరిగింది.