గుంటూరు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన క్రేన్ కాంతారావు: నేరేళ్ళ సురేష్

గుంటూరు: ప్రసిద్ధి చెందిన క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గ్రంధి కాంతారావు గుంటూరు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం కాంతారావు పుట్టినరోజు సందర్భంగా సంపత్ నగర్ లోని ఆయన స్వగృహంలో జనసేన పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో తన కంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించటమే కాకుండా ఆధ్యాత్మికంగానూ, సేవా రంగంలోనూ కాంతారావు తన సేవలను విస్తృతం చేసారని కొనియాడారు. కాంతారావుని సన్మానించిన వారిలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర నాయకులు ఆనంద్ సాగర్, బండారు రవీంద్ర, ఉదయ్, బాషా, రామిశెట్టి శ్రీను, పుల్లంసెట్టి ఉదయ్, గోపి, విజయ్, బాలకృష్ణ, శానం రమేష్, షర్ఫుద్దిన్, చెన్నా శ్రీకాంత్, ప్రసాద్, అంజి తదితరులు పాల్గొన్నారు.