జనం కోసం జనసేన 409వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: కిర్లంపూడి మండలం, కిర్లంపూడి గ్రామంలో జనం కోసం జనసేన 409వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం, కిర్లంపూడి గ్రామంలో మరియు ఎస్.తిమ్మాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 48900 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 410వ రోజు రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గండేపల్లి మండలం మురారి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి దంపతులు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల గౌరవ అద్యక్షులు మూరా సహదేవుడు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, కిర్లంపూడి గ్రామం నుండి నాగబోయిన శివ, సోరపురెడ్డి సత్తిరాజు, ఎస్.తిమ్మాపురం గ్రామం నుండి ఎద్దు అర్జున్, గండికోట కృష్ణ, కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, ఉగ్గిన శ్రీను, నడిపల్లి సతీష్, పప్పల రాజు, బావిశెట్టి గంగాధర్, రాజుపాలెం గ్రామం నుండి పోకల లోకేష్, కాండ్రేగుల గ్రామం నుండి యాళ్ళ ఆనంద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుసెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెసారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నాగబోయిన శివ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.