చేనేత గ్రామంలో జనంతో జనసేన 29వ రోజు

ఆముదాలవలస: చిన్న కురంపేట గ్రామంలో జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్ ఆధ్వర్యంలో చిన్న సాయి భవాని సమక్షంలో శుక్రవారం గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని, జనసేన సిద్ధాంతాలు వారికి వివరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలకు చలించి పోయామని, చేనేత కార్మికుల విలువైన ఒకప్పటి రోజుల గురించి చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపించిందని తెలియజేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి అని.. వారికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సైరిగాపు సంతోష్ నాయుడు, కోమల్, మోహన్, కిరణ్ రుద్ర, సాయి, అభి, మహేష్, ప్రదీప్, వినోద్ మరియు గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నరు.