చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

పెడన: నియోజకవర్గంలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం కురిసిన కొద్దిపాటి వర్షానికి పెడన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గూడూరు మండలం రైతులు ఎక్కువగా నష్టపోయారు. పంట కాలువలు గాని, మురుగు నీరు బయటకు పోయే డ్రైనేజీలు గాని ఎప్పటి నుండో మరమ్మతులు చేయకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పొలాలు నీట ములుగుతున్నాయి. పెడన నియోజకవర్గంలో వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పొలాలు నీట ములుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. గత నెలలో మంత్రి జోగి రమేష్ కృష్ణా డెల్టాకు నీటి విడుదల అంటూ మీడియా ముందు హడావిడి చేసి ఫోటోలు ఫోజులిచ్చి మామా అనిపించారు తప్ప, డెల్టాకు సరిగా సరిపడినంత నీటి సరఫరా జరుగుతుందా లేదా అనేది ఎలాంటి సమీక్ష చేయలేదు. మంత్రి జోగి రమేష్ అక్రమ మట్టి తవ్వకం మీద పెట్టిన శ్రద్ధ కాలువల మరమతుపై పెట్టకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణం. ప్రభుత్వ భూములను, కాలవగట్లను, పంచాయతీ చెరువులను ఇష్టానుసారంగా అక్రమ మట్టి రవాణా ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న వైసిపి నాయకులు రైతుల కష్టాలను, వారి అవసరాలను ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డెల్టా ప్రాంతాన్ని గతంలో అన్నపూర్ణగా అభివర్ణించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డెల్టా మనుగడ ప్రశ్నార్థకమైంది. డెల్టా రైతులది దిక్కుతోచని పరిస్థితి.
పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవేళ అమ్మిన సకాలంలో డబ్బులు రాని పరిస్థితి. దాన్యం కొనుగోలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని సాక్షాత్తు వైసిపి ఎంపీలు బహిరంగంగా మాట్లాడడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు, రైతు దగాకోరు కేంద్రాలుగా మారాయి. కృష్ణా డెల్టా కి గతేడాది రబీ సీజన్లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ చెప్పిన మాటలు, ఈ ఒక్కసారి రైతులు ఒక పంట త్యాగం చేస్తే, కాలువల మరమ్మతులు చేసుకోవచ్చు తద్వారా రాబోయే ఖరీఫ్ సీజన్లో నీటి ఎద్దడి ఉండదు అని చెప్పడం జరిగింది. భారీ వర్షాలు వచ్చినప్పుడు పంట పొలాలు ములగవు అని చెప్పడం జరిగింది. నేనిప్పుడు జోగి రమేష్ ని సూటిగా ప్రశ్నిస్తున్న, పంటకాలంలో గాని, మురుగు కాలువ లో గాని ఒక తట్టెడు మట్టి అయినా మీ ప్రభుత్వం తీసిందా?. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా మట్టిని అమ్ముకోవడం తప్ప, కాలువల మరమ్మతులు మీకు పట్టవా?. కాలవ గట్లను సైతం తోవుకుని మట్టి అమ్ముకుంటున్న మీకు కాలవలు తవ్వడం తెలియదా?. మీరా రైతుని రారాజు చేసేది. రైతును రైతులా బతకనివ్వండి చాలు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రైతుకైనా మద్దతు ధర లభించిందా?. వ్యవసాయానికి పూర్వవైభవం రావాలన్నా, రైతు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించాలన్న అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే సాధ్యం. 30 కోట్ల రూపాయల తన కష్టార్జితాన్ని రైతులకు ఆర్థిక సాయం చేసిన రైతుల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు అని ఎస్ వి బాబు పేర్కొన్నారు.