బోరింగ్ వలస గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన డిమాండ్

అనంతగిరి మండలం కొండిబ పంచాయతీ పరిధిలో గల బోరింగ్ వలస గ్రామంలో ప్రభుత్వం తక్షణమే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, సన్యాసిరావు ప్రభుత్వానికి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల సమయమున ఆయా గ్రామంలో పర్యటించి ముందుగాను గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగింది. ఆయా గ్రామాల్లో రోడ్లు, మంచినీరు సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ బోరింగ్ వలస గ్రామంలో తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికుడు పండన్న, నర్సింగ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.