లింగోలు సత్యవాణికి నివాళులర్పించిన డి.ఎం.ఆర్ శేఖర్

అమలాపురం రూరల్ మండలం, ఏ.వేమవరం గ్రామంలో ఇటీవల మరణించిన లింగోలు సత్యవాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను అమలాపురం జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి డి.ఎం.ఆర్ శేఖర్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.వేమవరం ఎంపీటీసీ సభ్యులు లింగోలు సత్యనారాయణ(సత్తులు), ఏ.వేమవరప్పాడు గ్రామ ఉపసర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి కన్న, గంగాబత్తుల కిషోర్, ఉద్దిశపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.