జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ సొంగ రోషన్ కుమార్ ఏర్పరిచిన సమన్వయ కమిటీ సభకు జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు, ఏలూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గోరుముచ్చు గోపాల్ యాదవ్, పోలవరం నియోజకవర్గం మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభలో చిర్రి బాలరాజు ప్రసంగిస్తూ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే జనసేన-తెలుగుదేశం ఐక్యతగా ఉండాలని, రానున్న రోజుల్లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు జనసేన యువతను కలుపుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. మరీ ముఖ్యంగా సొంగ రోషన్ కుమార్ ని అధిక మెజారిటీతో గెలిపించాలని చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఆయన సూచించారు.