పూరిగుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్న దళిత కుటుంబాలు

  • జగనన్న కాలనీలలో అమదాలవలస జనసేన డిజిటల్ క్యాంపెయిన్

అమదాలవలస నియోజకవర్గం: బూర్జ మండలం, కాకండ్యం గ్రామంలో 30 కుటుంబాలకు పైగా పేద కుటుంబాలు ఇంకా పూరి గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు.. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకునే నాయకుడు లేడు అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, సిక్కోలు ఎంపీటీసీ విక్రమ్ స్థానిక నాయకులతో అక్కడున్న దళిత కుటుంబాలు బాధలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అక్కడ పరిస్థితి చుసిన మేము వారు ఎలా బ్రతుకుతునన్నారో భయం వేసింది.. #ఫెయిల్యూర్ అఫ్ జగనన్న కాలనీలో భాగంగా జనసేన పార్టీ ద్వారా వీడియో ద్వారా స్థాయికి తీసుకొని వెళ్లి కొద్దీ నెలల్లో పరిష్కార మార్గం వచ్చేలా చేస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్, సేపేనా రమేష్, మోహన్, సాయి, వెంకటరమన మరియు స్థానిక ప్రజలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.