శ్రీ దుర్గాదేవి అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవంలో బొలియశెట్టి దంపతులు

కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేట్ లో తామరసిరి వినోదిని ఆధ్వర్యంలో ముడు రోజులుగా దుర్గాదేవి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి రోజు అంకురార్పణ, వాస్తుపూజ, రెండవ రోజు పంచగవ్యాధి, క్షిరాదివాస, జలదివాసములు, అధివసా హోమమలు, మూడోరోజు శ్రీ దుర్గాదేవి సహిత పరివార దేవతల విగ్రహాలు ప్రతిష్ట మంచా అమృత అభిషేకం పూజలు.. నాలుగవ రోజు ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ దుర్గాదేవి, శివలింగం, నవగ్రహాలు, ప్రతిష్ట చేయబడును ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం శ్రీ దుర్గాదేవి అమ్మవారి పంచామృత అభిషేకం హోమములో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి బొలియశెట్టి శ్రీకాంత్ విజయదుర్గ దంపతులు 10 వేల రూపాయిలు విరాళం అందించారు. గత 20 సంవత్సరాల నుండి వినోదిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజలు చేస్తున్నారు. అమ్మవారి కార్యక్రమానికి తనవంతు సహాయ సహకారాలు కొత్తగేట్ సిరిపురం సురేష్ అందిస్తున్నారు. కొత్తగేట్ భక్తులే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పూజలు చేసి దర్శించుకున్నారు.