జల్లూరు ప్రాంతం ఎస్సీ కాలనీలో దళిత వాడల్లో జనచైతన్యం

పిఠాపురం, చైతన్యవంతమైన దళిత యువకులను జనసేన పార్టీ వైపుగా నడపడమే లక్ష్యంగా పిఠాపురం రూరల్ జనసేన నాయకుడు మరియు దళిత నాయకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాశ్ పిఠాపురం మండల వ్యాప్తంగా మొదలు పెట్టిన దళిత వాడల్లో జనచైతన్యం అనే కార్యక్రమం నేడు జల్లూరు గ్రామం ఎస్సి కాలనీకి చేరుకుంది. నియోజకవర్గ జనసేన నాయకులు వెన్నా జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమానికి మొదటగా వాకపల్లి సూర్య ప్రకాష్ స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త జాతినేత అయిన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. తదనంతరం స్థానిక దళిత యువకులతో సమావేశమయిన వాకపల్లి సూర్య ప్రకాష్ దళిత వాడల్లో జన చైతన్యం అనే కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది అని చెబుతూ, మాజీ శాసనసభ్యులు ప్రాతస్మరణీయులు కీర్తిశేషులైన స్వర్గీయ వెన్నా నాగేశ్వరరావు స్వగ్రామమైన జల్లూరులో ఈ కార్యక్రమాన్ని వారి తనయులైన వెన్నా జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను అని తెలియజేసి స్థానిక దళిత నాయకుడు అయిన వార్డు మెంబర్ హరీష్ కోరికమేరకు వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శిరీష స్థానిక యువతని ఉద్దేశించి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ చైతన్యపరమైన ప్రసంగాన్ని ఇవ్వగా నాయకులు వెన్నా జగదీష్ సూర్య ప్రకాష్ జనసేన పార్టీ చేస్తున్న కృషిని అభినందిస్తూ తనకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందివ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రసంగించారు. స్థానిక దళిత యువకులైన పృద్వి, శ్రీను, అర్జున్, హరీష్, చిన్నారావు, యానోష్, సురేష్, సతీష్, శ్యామ్, చిట్టీ, ధర్మరాజు, సతీష్ తదితరులతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో బత్తిన దొరబాబు, పిల్లి అన్నారం, ముమ్ముడి సత్యానంధం, తిరంశెట్టి ఇస్సాకు, వెన్నా శ్రీరామ్, నాని తదితర స్థానిక నాయకులు, మరియు రూరల్ నాయకులు అయిన అడపా శివరామకృష్ణ, రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్, గంజి గోవిందరాజులు పాల్గొన్నారు.