శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • శ్రీకృష్ణపట్నం గ్రామంలో శ్రీరామనవమి

రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని అంగరంగ వైభవంగా దొడ్డా రాంబాబు, శ్రీమతి నాగసత్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడీ శ్రీరామ్, సుంకర గోపాలకృష్ణ, సుంకర బాబ్జి, మోటుపల్లి మణికంఠ, సుంకర సీతారాం, దేనేడి మణికంఠ స్వామి, దేశాల మురళి మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

  • నిడిగట్ల గ్రామంలో శ్రీరామనవమి

రాజానగరం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో శ్రీరామనవమి మహా పర్వదినం సందర్భంగా మేడిశెట్టి శివరామ్ దంపతుల ఆధ్వర్యంలో కనుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • గాదరాడ గ్రామంలో శ్రీరామనవమి

రాజానగరం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో శ్రీరామనవమి మహా పర్వదినం సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కనుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • వెదుళ్ళపల్లి గ్రామంలో శ్రీరామనవమి

రాజానగరం, సీతానగరం మండలం, వెదుళ్ళపల్లి గ్రామంలో శ్రీరామనవమి మహా పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వర్రావు, తన్నీరు సురేష్, తన్నీరు రాజేంద్ర, తన్నీర్ సాయి గణేష్, ఎస్.వినయ్, మరిపిండి గణేష్, తన్నీరు సాయి పోశయ్య, తన్నీరు అచ్యుత్, తన్నీరు రవీంద్ర, బిలపూడి శ్రీను, పిండి వివేక్ తదితర నాయకులు పాల్గొన్నారు.