అభయ ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64వ వార్డ్ సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం అభయ ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించి, పూజలో పాల్గొనడం జరిగింది. సత్యనారాయణపురం ఆలయ కమిటీని ఉద్దేశించి గౌరవ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతీతంగా అంకితభావంతో ఏ చిన్న గొడవ లేకుండా అందరు కలిసిమెలిసి గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడం జరిగింది. గుడి నిర్మాణానికి నా వంతు ఆర్థిక సహాయాన్ని కూడాచేస్తానని కార్పొరేటర్ గోవింద్ రెడ్డి ప్రజల ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణపురం గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.