అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న జనసైనికులు

కాకినాడ రూరల్: తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ రూరల్ కు చెందిన జనసైనికులు అయ్యప్ప పడి పూజలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరు బాగుండాలని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసే విధంగా పార్టీ బలోపేతానికి స్వామి వారి ఆశీస్సులు కలగాలని, అలాగే పవన్ కళ్యాణ్ కు ఎన్ని దుష్టశక్తులు ఎదురైనా స్వామి వారి ఆశీస్సులతో వాటిని ఎదిరించే శక్తి కలగాలని కోరుకోవడం జరిగింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తున్న పంతం నానాజీ నాయకత్వం బలపడాలని, నానాజీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో బలంగా నిలబడతాం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ క్రియాశీలక సభ్యులు అనిల్ కుమార్, ఆయుబ్, వాయిడ్, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.