రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టం: సుప్రీంలో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టును కోరింది.  టెండర్ ప్రక్రియ ను నిలిపివేయాలని పిటిషన్ లో కోరింది. మంగళవారం రాత్రి ఎలక్ట్రానిక్ విధానంలో పిటిషన్ దాఖలు చేసింది.