వైఎస్సార్ పార్టీ నుండి దర్శి జనసేనలో భారీ చేరికలు

దర్శి నియోజకవర్గం: దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్ మరియు దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షేక్ షఫీయుల్లాఖాన్ నాయకత్వంలో దొనకొండ మండలం, మల్లంపేట గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు షేక్ మీరావాలి మరియు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు ముప్పై మంది ఆదివారం దర్శి లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా కురిచేడు గ్రామము నుండి డేవిడ్ పార్టీలోకి చేరడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు జనసేన పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ అధినేత నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుందామని, నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశంపార్టీల ఉమ్మడి అభ్యర్థిని వచ్చే ఎన్నికలలో గెలిపించుకొని సుపరిపాలన సాధిద్దామని అన్నారు. సుపరిపాలన కోసం నియోజకవర్గంలోని ప్రజలను జనసేన పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ ను మరియు పట్టణ అధ్యక్షులు షఫీయుల్లాఖాన్ ను, వీరమహిళా నాయకురాలు శ్రీమతి యన్నం మార్తమ్మ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షులు షఫీయుల్లాఖాన్, వీరమహిళా నాయకురాలు శ్రీమతి యన్నం మార్తమ్మ, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దర్శి పట్టణ కమిటీ అధ్యక్షులు చాతిరాశికొండయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, కురిచేడు మండల కమిటీ కార్యదర్శి మోషే, మండల నాయకులు ప్రత్తి శ్రీరంగం మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీలో చేరిన మీరావలి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని నమ్మి జనసేన పార్టీలో చేరామని, జనసేన పార్టీ అధినేత ఆశయాల కనుగుణంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాలనరసింహారావు, పందుల శామ్యూల్ తదితరులు కూడా పాల్గొన్నారు.