ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాసరి రాజు

ఇచ్చాపురం, కవిటి మండలం, నెలవంక పంచాయతీ, కొమ్ము పుట్టుగ గ్రామంలో గుంతలుగా ఏర్పడిన రోడ్డు వల్ల గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు ఈ నెల 2 వ తేదీన అక్కడికి వెళ్లి పరిశీలించి గుంతలుగా గల రోడ్డు తాత్కాలిక మరమ్మత్తు కోసం కంకర లోడ్లు వేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అన్నమాట ప్రకారం మంగళవారం దాసరి రాజు ఆధ్వర్యంలో జనసైనికుల సహకారంతో గ్రామ పెద్దల సమక్షంలో కంకర వేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు అన్నమాట నిలుపుకున్నారు అని దాసరి రాజుని గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో అందరికీ పూర్తి స్థాయిలో అంతా మంచే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధు, శ్యామ్, ధనుంజయం, వైకుంఠ రావు, భాస్కర్, రఘు, నాగరాజు, మహేశ్, సాయి, హేమంత్ మరియు గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.