పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేందుకు వైసీపీ దాడులు

* నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్.. నేడు ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం
వైసీపీ సర్కార్ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయం. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు చేసిన దాడి ఆ పార్టీవాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడించింది. ఇప్పుడు ఈనాడుపై అదే పంథా చూపించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలి అని జనసేనాని కోరారు.