ప్రజాచైతన్య కార్యక్రమం 3వ రోజు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో సూర్యనారాయణపురం ప్రాంతంలో పార్టీ శ్రేణులు ప్రజాచైతన్య కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అవినీతిభాగోతాన్ని వివరించి అవగాహన వచ్చేలా జాగ్రుతం చేసారు. నేటి ఈ వై.సి.పి ప్రభుత్వానికి బకాసురుడికన్నా ఆకలి ఎక్కువ అనీ ముట్టుకుంటే కోట్లాది రూపాయలు భోజనం చేసేస్తున్నారని ఆరోపించారు. మచ్చుకగా ఇటీవల బలహీన వర్గాలకు గేదలను కొని ఇచ్చి పంపిణీ చేసామని లెక్కలు చెప్పి వందలాది కోట్లు నొక్కేసారని బట్టబయలు ఐందనీ అయినా సరే నిస్సిగ్గుగా ఏ.పి కి నేను కావాలి, నాకు 175 కావాలీ అని అంటూ ఈముఖ్యమంత్రి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. జనం అంటే మనం మనం అంటే జనం అని చెప్పుకున్న ఈ వై.సి.పి కి వచ్చే ఎన్నికల్లో జ్వరాలే అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ, దారపు శిరీష, బట్టు లీల, చీకట్ల వాసు, అజయ్ యాదవ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.