జె.జి.ఆర్. హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పిఠాపురం: జోగా వెంకట రమణ ఆహ్వానం మేరకు గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం పట్నంలో జె. జి. అర్. హాస్పిటల్ ఆధ్వర్యంలో డా. జోగా వీర బాలాజీ, డా. జోగా లలితల నేతృత్వంలో వివిధ విభాగలకు చెందిన వైద్య మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులవల్ల ప్రజలు ఎదుర్కొనే అనారోగ్య ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు పి.ఎస్.ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇలా ఉచిత మెడికల్ వైద్య శిబిరాలు పెట్టడం వల్ల పేదలకు సరైన వైద్యం అందుతుందని అలాగే ఈ వైద్యం మందులు ఉచితంగా అందించినందుకు జే.జి.ఆర్.హాస్పిటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, కర్రి కాశి, పెంకే జగదీష్, ముప్పన రత్నం, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, కోలా దుర్గ దేవి, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి నాయకులు. జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.