జనంకోసం జనసేన 303వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 303వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం బలభద్రపురం మరియు గోవిందపురం గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 1000 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంగా 70,895 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల కార్యదర్శి తుమ్మల ఫణీంద్ర, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి సీదిరి విష్ణుమూర్తి, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, బలభద్రపురం నుండి యర్రా స్వామీ, పప్పల శివరామ్, సిదిరి సాయిబాబు, పండ్రాడ స్వామి, యర్రా సత్తిబాబు, పప్పల వీరదుర్గ, ముమ్మన ఉమామహేష్ గారికి, గోవిందపురం నుండి పాటంశెట్టి నాని, వానపల్లి థామస్ తేజ, మానేపల్లి సత్యనారాయణ, కమ్ముల రాజేష్, కృష్ణాపురం నుండి బాలెం మణికంఠ స్వామి, గొర్రపల్లి మణికంఠ స్వామి, అమరపల్లి శ్రీనివాస్, బాలెం అర్జున్ సాయి, వల్లభశెట్టి రాజ, గోపి కాశీ, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, మోల్లేటి రాజు, వెంగయ్యమ్మపురం నుండి రౌతు పైడియ్య, రామవరం నుండి మాదాసు సాయి కుమార్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 302వ రోజు జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గుండే విశాంత్ కుమార్ కుటుంబ సభ్యులకు, కొండపల్లి అమ్మాజి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.