పోలవరంలో జనం కోసం జనసేన 94వ రోజు

పోలవరం: బుట్టాయిగూడెం మండలంలో గుబుసి మామిడి, రంగాపురం గ్రామంలో మండల అధికారి ప్రతినిధి మెట్ట బుచ్చిరాజు మరియు ప్రధాన కార్యదర్శి జి. సత్యనారాయణ గారుమండల వైస్ ప్రెసిడెంట్ ఏలేటి ఏడుకొండలు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 94వ రోజు కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారితో కలిసి వారితో మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులను వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తమ గ్రామాల అభివృద్ధి చేస్తానని రోడ్లు వేయిస్తానని చెప్పి మోసగించి గద్దె ఎక్కిన తెల్లం బాలరాజు శైలిని తప్పుపట్టారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఒక్క రోడ్డు కూడా పోయించలేని ఎమ్మెల్యే మనకు అవసరమా అని, ప్రభుత్వ కార్యక్రమాలపై తిరగడానికి ఉన్న సమయం ప్రజల సమస్యలపై వెచ్చించడానికి లేదని, తనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప సొంత ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి కాదని ఎద్దేవ చేశారు. పది నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని సుమారు గంట సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందని, ఇదా మీరు చేసిన అభివృద్ధి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమం లో గురజాలా వెంకటేష్, పూనెం రాజా, సింగంశెట్టి మనోహర్,జోడే కృష్ణ మూర్తి, జోడే ప్రసాద్,పాయం శ్రీ హరి, జోడే మంగరాజు, దుర్గారావు, శ్యామ్, నాగరాజు, పొట్ట మంగరాజుతదితరులు పాల్గొన్నారు.